రూ.225 తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ:.ఈ ప్లాన్ గురించి మీకు తెలుసా.!

Updated on 28-Jan-2023
HIGHLIGHTS

అతితక్కువ ధరకే లైఫ్ టైం వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్

ఒక్కసారి ఈ ప్లాన్ రీఛార్జ్ చేయండి జీవితాంతం హ్యాపీగా ఉండండి

ఈ ప్లాన్ ను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీ

ఈరోజుల్లో మొబైల్ నంబర్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అయితే, ఇప్పుడు కూడా కేవలం అతితక్కువ ధరకే లైఫ్ టైం వ్యాలిడిటీ  అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది. ప్రభుత్వ టెలికం సంస్థ మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (MTNL) ఈ ప్లాన్ ను అఫర్ చేస్తున్న ఏకైక టెలికం కంపెనీగా నిలుస్తుంది. జియో, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా(Vi) వంటి ప్రయివేట్ టెలికం సంస్థలు రీఛార్జ్ ఆధారిత వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేస్తుండగా, మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (MTNL) మాత్రం తన రూ.225 (JS) ప్రీపెయిడ్ ప్లాన్ తో జీవితకాలం వ్యాలిడిటీని అఫర్ చేస్తోంది. మరి ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా.

MTNL Rs.225 (JS) Plan:

ఈ ప్లాన్ కోసం మీరు కేవలం రూ.225 రూపాయలు చెల్లించి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్లాన్ రీఛార్జ్ తో లైఫ్ టైం వ్యాలిడిటీ అందుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు రీఛార్జ్ తో మీకు 100 నిముషాల ఉచిత కాలింగ్ మినిట్స్ కూడా అందుతాయి. అంటే, కేవలం 225 రూపాయల ఖర్చుతోనే జీవితకాలం వ్యాలిడిటీతో పాటుగా 100 నిముషాల కాలింగ్ మినిట్స్ కూడా మీరు పొందుతారు.

ఒక కాలింగ్ రేట్ మరియు ఇతర వివరాల్లోకి వెళితే, హోమ్ నెట్వర్క్ పైన లోకల్ మరియు STD కాలింగ్ కోసం నిముషానికి రూ.0.20 (20పైసలు) ఛార్జ్ చేయబడుతుంది. ఇక వీడియో కాలింగ్ కోసం నిముషానికి రూ.0.60 మరియు ఇతర నెటవర్క్ కోసం రూ.0.60 ఛార్జ్ చేయబడుతుంది. ఇక SMS ఛార్జ్ విషయానికి వస్తే, లోకల్ SMS కోసం Rs.0.50/SMS, నేషనల్ SMS కోసం Rs.0.50/SMS మరియు ఇంటర్నేషనల్ SMS కోసం రూ.4 నుండి రూ.5 వరకు చెల్లించాలి. చివరిగా డేటా విషయానికి వస్తే, 1MB డేటా వినియోగానికి 3పైసలు చెల్లించాలి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :