Xiaomi: సెప్టెంబర్ 6న మూడు కొత్త ఫోన్లను లాంచ్ చెయ్యనుంది.!

Updated on 02-Sep-2022
HIGHLIGHTS

Xiaomi సెప్టెంబర్ 6 న మూడు ఫోన్లను లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది.

కీలకమైన ఫీచర్లతో కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది

Redmi A1 బడ్జెట్ వినియోగదారులను లక్ష్యం చేసుకు వచ్చే ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్

Xiaomi: సెప్టెంబర్ 6 న మూడు ఫోన్లను లాంచ్ చెయ్యనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ల యొక్క కీలకమైన ఫీచర్లతో కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ నుండి  టీజింగ్ ను కూడా మొదలుపెట్టింది. ఈ రెండు ఫోన్లలో ఒకటి Redmi A1 కాగా మరొరెండు ఫోన్లు Redmi 11 Prime సిరీస్ నుండి లాంచ్ చేయునట్లు టీజింగ్ చేస్తోంది. వీటిలో, Redmi A1 బడ్జెట్ వినియోగదారులను లక్ష్యం చేసుకు వచ్చే ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ కావచ్చు. అలాగే, A1 మీడియా టెక్ చిప్‌సెట్‌తో క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇక రెడ్ మి గురించి వెల్లడించిన మరిన్నిఫీచర్లను చూస్తే, ఈ ఫోన్ లెదర్ లుక్ బ్యాక్ ప్యానల్ లో కనిపిస్తోంది మరియు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు చూపే చిత్రాలను అందించింది. అంతేకాదు, Redmi A1 పెద్ద 5,000 mAh బ్యాటరీని కూడా కలిగివున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, స్కై బ్లూ మరియు గ్రీన్ మూడు కలర్ లలో కనిపిస్తోంది.

ఇక Redmi 11 Prime సిరీస్ నుండి లాంచ్ చేయనున్నట్లు చెబుతున్న మిగిలిన రెండు ఫోన్ల కీ స్పెక్స్ ను కూడా షియోమీ టీజింగ్ చేస్తోంది. వీటిలో ఒక ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాతో కనిపిస్తుండగా, మరోకటి డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్ల డిజైన్ లో కూడా చాలా మార్పులు వున్నాయి. ఈ రెండు ఫోన్లలో ఒక 5G ఫోన్ అవుతుంది మరియు ఆ ఫోన్ మీడియాటెక్ Dimensity 700 5G చిప్ సెట్ తో పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :