వాట్స్ అప్ లో వస్తున్న నరేంద్ర మోడీ 500 రూ ఫ్రీ రీచార్జ్ లోని నిజమెంత?

Updated on 03-Jan-2017

కొంతకాలం అయ్యింది కదా రూమర్ క్రియేట్ అయ్యి, అందుకే ఇప్పుడు లేటెస్ట్ గా మరొక ఫేక్ మెసేజ్ బాగా హాల్ చల్ చేస్తుంది ఇంటర్నెట్ ప్రపంచంలో.

whatsapp లో నరేంద్ర మోడీ ఫ్రీ గా 500 రూ రిచార్జ్ ఇస్తున్నారని, అందుకు ఒక లింక్ ఇచ్చి ఆ లింక్ పై క్లిక్ చేస్తే అన్ని తెలుసుకోగలరు అని మెసేజ్ వస్తుంది. అందరికి షేర్ చేయమని ఉంటుంది.

ఆ లింక్ పై క్లిక్ చేస్తే మీ కంప్లీట్ డిటేల్స్ నింపమని అడుగుతుంది. సో ఇక్కడ ఉన్నదంతా నమ్మి డిటేల్స్ ఫిల్ చేస్తే మీరు ఫిల్ చేసిన డేటా ను వారు సొంత కార్యకలాపాలకు వాడుకోవటం తప్ప మీకు ఫ్రీ recharge ఏమి రాదు.

మోడీ పేరు మీద కూడా డైరెక్ట్ గా ఇలాంటి ఫేక్ మెసేజ్ లు సృష్టిస్తున్నారు అంటే మీరు అందరూ వాటిని నమ్ముతారు అని వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో గమనించండి.

ఒకేసారి కాకపోయినా కొంతకాలానికి నెమ్మదిగా వీళ్ళ ఫేక్ మెసేజ్ పనులు కనుమరుగు అవుతాయి అని ఆశిస్తున్నాము.

Moto G Plus అమెజాన్ లో 13,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :