Samsung Galaxy S8 plus యొక్క 6GB RAM వేరియంట్ భారత్ లో లాంచ్

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

Samsung Shop మరియు Flipkart లో శుక్రవారం , 2 జూన్ నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చును.

 మొబైల్ నిర్మాణ  దిగ్గజం  Samsung  యొక్క ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్  Samsung Galaxy S8 plus  యొక్క  6GB  RAM  వేరియంట్  ఇండియాలో లాంచ్ చేయబడింది .  ఈ డివైస్ లో ఇంటర్నల్ స్టోరేజ్  128GB . 
 ఈ వేరియంట్ భారత్ లో  8  జూన్ నుంచి అందుబాటులోకి వస్తుంది .  ఈ డివైస్ యొక్క ధర  Rs. 74,990  ఉంటుంది .  ఈ వేరియంట్ ని  Samsung Shop  మరియు  Flipkart  లో శుక్రవారం , 2  జూన్ నుంచి ప్రీ  ఆర్డర్  చేసుకోవచ్చును.  
ఈ ఫోన్ లో  5.8 ఇంచెస్ మరియు గాలక్సీ  S8  ప్లస్ లో  6.2  ఇంచెస్  QHD Super AMOLED  డిస్ప్లే లు వున్నాయి .   ఈ రెండు ఫోన్స్  IP68  సర్టిఫికేషన్   పొందాయి.  అంటే ఇవే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నమాట .
గాలక్సీ  S8  లో AI  అసిస్టెంట్  'Bixby' కలదు .  ఈ ఫీచర్  వాయిస్  కమాండ్  పై  పని చేస్తుంది మరియు యూజర్  యొక్క ప్రశ్నలకి  ఆన్సర్  చేస్తుంది.  అంతే కాకుండా ఈ డివైస్ లో  4GB  RAM  మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. ఈ డివైస్ లో బ్యాటరీ  3000mAH  అలాగే  S8  ప్లస్ లో 3500mAh  బాటరీ కలిగి వైర్  లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది .
ఈ డివైస్ లో రేర్ కెమెరా  12 ఎంపీ మరియు  ఫ్రంట్  5  ఎంపీ కలవు .   Samsung galaxy S8  మరియు  S8 plus  రెండు డివైస్  లోను   బియోమెట్రిక్ అతెం టికేషన్  ఫీచర్ కలదు . 

Connect On :