Xiaomi: ఇండియాలో విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్.!
విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్
Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ జనవరి 5 న ఇండియాలో లాంచ్ అవుతోంది
Redmi Note 12 లైనప్ అక్టోబర్లోనే చైనాలో ప్రారంభించబడింది
Xiaomi: ఇండియాలో విడుదలకు సిద్ధమైన షియోమీ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్. అదే, Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను జనవరి 5 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. వాస్తవానికి, Redmi Note 12 లైనప్ అక్టోబర్లోనే చైనాలో ప్రారంభించబడింది మరియు చైనాలో Redmi Note 12, Redmi Note 12 Pro మరియు Redmi Note 12 Pro + లను లాంచ్ చేసింది. అయితే, ఇండియాలో రెడ్ మీ నోట్ 12 ప్రో+ గురించి టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ షియోమీ స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి ఫీచర్లను ఆశించవ్చనో చూద్దాం పదండి.
Redmi Note 12 Pro+ 5G: స్పెక్స్ (అంచనా)
చైనాలో లాంచ్ అయిన Redmi Note 12 Pro+ స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల FHD+ OLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్తో కలిగివుంది. ఇది ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ Dimensity 1080 SoC శక్తితో పనిచేస్తుంది మరియు 12GB LPDDR4X RAM మరియు Mali-G68 GPU వరకు అందిస్తుంది.
Redmi Note 12 Pro+ వెనుతికె ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది మరియు ఇది OIS సామర్థ్యాలతో కూడిన 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2-MP మాక్రో లెన్స్ని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీల కోసం 16MP సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.