ఇండియాలో Redmi Note 12 Series ని జనవరి 5న లాంచ్ చేయ్యడానికి షియోమి సిద్దమయ్యింది. ఈ సిరీస్ నుండి Note 12, Note 12 Pro 5G మరియు Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.ఇందులో, Redmi Note 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 200MP కెమెరాతో వస్తుందని, షియోమి చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది. అలాగే, Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ 50MP కెమెరాతో వస్తుందని తెలిపినా, ఇది ఎటువంటి సెన్సార్ తో ఉంటుందో ఇప్పటి వరకూ చెప్పలేదు. కానీ, ఈ 12 Pro 5G ఫోన్ Sony IMX766 సెన్సార్ తో వస్తుందని కన్ఫర్మ్ అయ్యింది.
షియోమి ఇండియా జనరల్ మేనేజర్ అయిన Alvin Tse, తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేసిన ట్వీట్ ద్వారా ఈ Redmi Note 12 Pro 5G ఫోన్ లో Sony IMX766 సెన్సార్ ను ఉన్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ ఫోన్ తో తీసిన ఫోటోలు ఎంత క్లియర్ గా ఉన్నాయనే విషయాన్ని కూడా ఆ ట్వీట్ లో వివరించారు. ఈ ఫోన్ లో అందించిన సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ టూల్స్ తో డైనమిక్ మరియు ఎంగేజింగ్ ఫోటోలను పొందవచ్చని అయన తన ట్వీట్ లో తెలిపారు.
https://twitter.com/atytse/status/1609087764913586176?ref_src=twsrc%5Etfw
ఇక షియోమి అధికారిక సైట్ నుండి అందించిన టీజర్ ద్వారా Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ 50MP OIS కెమెరాతో వస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఈ అన్ని విషయాలను కలిపి చూస్తే, రెడ్ మి నోట్ 12 ప్రో 5G స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX766 ప్రధాన సెన్సార్ తో వస్తుందని అర్ధం చేసుకోవచ్చు.
రెడ్ మి నోట్ 12 ప్రో 5G టీజింగ్ ద్వారా, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేని Dolby Vision సపోర్ట్ తో కలిగివుంటుంది. అంతేకాదు, ఆడియో పరంగా Dolby Atmos సపోర్ట్ మరియు వేగవంతమైన మీడియాటెక్ 5G చిప్ సెట్ Dimensity 1080 వంటి స్పెక్స్ తో ఉంటుందని తెలుస్తోంది.