Redmi ఈరోజు ఇండియాలో Redmi Note 12 5G Series నుండి మూడు ఫోన్లను విడుదల చేసింది. ఇందులో Note 12, 12 Pro మరియు Note 12 Pro+ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో, రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 5G చిప్ సెట్, మంచి డిజైన్ మరియు Super AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగివుంది. బడ్జెట్ ధరలో ఈరోజే విడుదలైన ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
రెడ్ మి నోట్ 12 5G స్మార్ట్ ఫోన్ ను రూ.17,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఈ ఫోన్ జనవరి 11 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI మరియు డెబిట్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,500 డిస్కౌంట్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ EMI అప్షన్ తో కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్లను ఈ ఫోన్ అందించింది.
Redmi Note 12 5G ఫోన్ 6.67-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 4 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 6GB RAM మరియు 256GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.
ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, 48MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ ఫ్రాస్టడ్ గ్రీన్, మెట్టే బ్లాక్ మరియు మిస్టిక్ బ్లూ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది