భారతీయ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్ Redmi A1+. ఈ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ రేపు మొదటిసారిగా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, రెడ్ మీ ఎ1+ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు జరగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ లేటెస్ట్ రెడ్ మీ ఫోన్ ధర మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు.
షియోమీ ఈ ఫోన్ బేస్ మోడల్ ని 2GB RAM మరియు 32GB స్టోరేజ్ తో ధరతో రూ.7,499 లాంచ్ చేసింది. అదే సమయంలో, 3GB RAM వేరియంట్ 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499 గా ప్రకటించింది. అయితే, ఈ దీపావళి పండుగ కోసం ఈ ఫోన్ ను అఫర్ ధరతో సేల్ చేయనున్నట్లు ప్రకటించింది. దీపావళి సేల్ లో భాగంగా, కొనుగోలుదారులు ఈ ఫోన్ 2GB వేరియంట్ ను రూ. 6,999 ధరకు మరియు 3GB వేరియంట్ను రూ.7,999 కి కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ అఫర్ ధర కేవలం అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 31 వరకూ Mi.com, Mi హోమ్ స్టోర్స్, Flipkart మరియు రిటైల్ పార్టనర్స్ వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
రెడ్ మీ ఎ1+ స్మార్ట్ ఫోన్ HD+ (720 x 1600 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన 6.52-అంగుళాల IPS LCD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే సాధారణ 60Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు ఫ్రంట్ కెమెరా కోసం పైభాగంలో వాటర్-డ్రాప్ నాచ్ ని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ MediaTek Helio A22 SoC ప్రాసెసర్ని కి జతగా 3GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) OS పైన రన్ అవుతుంది.
ఇక ఈ ఫోన్ కలిగిన కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 8ఎంపి ప్రైమరీ సెన్సార్ కి జతగా 2ఎంపి డెప్త్ కెమెరా వుంది. ముందు, సెల్ఫీల కోసం 8ఎంపి సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది. Redmi A1+ స్మార్ట్ ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.