ఇప్పటివరకు వచ్చిన రెడ్మీ ఫోన్స్ అన్నే కూడా చాలా మంచి రెస్పాన్స్ లో మార్కెట్లో సేల్ అయ్యాయి ఇప్పటకీ సేల్ అవుతూనే వున్నాయి. అయితే xiaomi ఇప్పటివరకు రిలీజ్ చేసిన స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోను బాగా ఎక్కువ జనాదరణ పొందిన ఫోన్ మాత్రం రెడ్మీ 3s అని చెప్పాలి. ఎందుకంటే ఇది మంచి బ్యాటరీ బ్యాక్ అప్ కలిగి మంచి కెమెరా క్వాలిటీ కలిగివుండుట మాత్రమే కాక బడ్జెట్ లో అతితక్కువదరకే లభ్యమవుతుండటం గమనార్హం , అయితే తాజాగా ఈ రెడ్మీ 3 s ఫోన్ రికార్డుల మోత మోగిస్తుంది. కేవలం తొమ్మిదినెలల్లో 40లక్షల రెడ్ మి 3ఎస్ స్మార్ట్ఫోన్లను సేల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఆన్లైన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్గా నిలిచింది.
xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.