రిలయన్స్ జియో 5G పైన తొలిగిన పరదా.. ఇవే కొత్త సంగతులు.!!

Updated on 14-Aug-2022
HIGHLIGHTS

భారత టెలికాం రంగంలో అత్యధికంగా వినిపిస్తున్నది 5G సర్వీస్ ల గురించి మాత్రమే

Reliance Jio నుండి 5G సర్వీసులు ఉహిచనంత తొందరగా అందుబాటలోకి వస్తాయని కొత్త వార్తలు

కొత్త అంచనాలు జియో 5G సర్వీస్ గురించి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి

గత కొన్ని నెలలుగా భారత టెలికాం రంగంలో అత్యధికంగా వినిపిస్తున్నది 5G సర్వీస్ ల గురించి మాత్రమే. ఇండియాలో 2022 చివరి నాటికి 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు Reliance Jio నుండి 5G సర్వీసులు ఉహిచనంత తొందరగా అందుబాటలోకి వస్తాయని కొత్త వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త అంచనాలు జియో 5G సర్వీస్ గురించి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి.    

ఇండియాలో 5జీ సర్వీస్ లను ప్రారంభించడం ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటాము, అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఈ మాటలను బట్టి జియో తన 5G సర్వీస్ లను ఆగష్టు 15న ప్రకటించని అంచనా వేస్తున్నారు. ఒకవేళ Jio 5G ఆగష్టు 15 న లాంచ్ చేయబడితే, ఇది ప్రధానంగా ట్రయల్ సర్వీస్ కోసం ముందుగా పెద్ద నగరాల్లో ప్రారంభించబడుతుంది. వాస్తవానికి, ఈ ఏడాది చివరి నాటికి అసలు సర్వీస్‌ను ప్రారంభించనున్నారు.

Jio 5G ముందుగా ఏ నగరాల్లో ప్రారంభిస్తుంది?

Jio ప్రస్తుతం 9 ప్రధాన నగరాల్లో తన 5G సర్వీస్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సమాచారం. అందులో,  ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, జామ్‌నగర్ ఉన్నాయి వంటి పెద్ద నగరాలు ఉన్నాయి. ఇది కాకుండా, గురుగ్రామ్, నోయిడా మొదలైన వాటితో సహా మరో 1000 ప్రధాన ప్రాంతాల్లో 5G ని తీసుకురావడానికి జియో యోచిస్తోంది.

5G సర్వీస్ ప్లాన్‌ల ధర ఎలా ఉంటుంది?

జియో యొక్క 5G ప్లాన్‌ల ధర ఎంత అనేది ఇంకా తెలియదు. అయితే, ధరలు పెరిగినప్పటికీ, Jio 4G ప్రీమియం ప్లాన్స్ ధరలను కూడా ఇప్పటికీ రూ.400-500 లోపే ఉంచింది. కాబట్టి, 5G సర్వీస్ యొక్క ఆకర్షణీయమైన ప్లాన్ ధర 500 కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :