కస్టమర్లకు షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్: షాపింగ్ చేసే వారి పైన భారం.!

Updated on 01-Nov-2022
HIGHLIGHTS

Flipkart డెలివరీ ఛార్జ్ ల పైన కొత్త నిర్ణయం తీసుకొని కస్టమర్లకు షాకిచ్చింది

ఫ్లిప్ కార్ట్ ఇకనుండి మరింత భారాన్ని మోపనునట్లు కనిపిస్తోంది

కస్టమర్లకు డెలివరీ ఛార్జ్ లు భారంగా మారవచ్చు

ప్రముఖ ఈకార్ట్ కంపెనీ Flipkart డెలివరీ ఛార్జ్ ల పైన కొత్త నిర్ణయం తీసుకొని కస్టమర్లకు షాకిచ్చింది. డెలివరీ పైన కేవలం నామమాత్రపు హ్యాండ్లింగ్ రుసుమును  మాత్రమే ఛార్జ్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ ఇకనుండి మరింత భారాన్ని మోపనునట్లు కనిపిస్తోంది. అంటే, కొన్ని డెలివరీ అప్షన్ పైన అదనపు ఛార్జ్ లను మోపుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ యొక్క వెబ్సైట్ మరియు యాప్ నుండి వెల్లడించింది. అయితే, ఈ హ్యాండ్లింగ్ ఛార్జ్ లు అందరి కోసం మాత్రమే కాదు  కొత్తగా విధించనున్న ఈ హ్యాండ్లింగ్ ఫీజులను కేవలం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పైన మాత్రమే జత చేయనున్నట్లు తెలిపింది.

ఇక ఫ్లిప్ కార్ట్ తీసుకొస్తున్న ఈ కొత్త విధానం యొక్క పూర్తి వివరాల్లోకి వెళితే, క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ అప్షన్ ఎంచుకునే కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ ఇక నుండి 5 రూపాయల రుసుమును జత చేస్తుంది. ఆన్లైన్ పేమెంట్  వారికి ఈ అదనపు ఫీజు వర్తించదు. అయితే, మీ ఆర్డర్ విలువ 500 రూపాయల కంటే తక్కువ వుంది ఆ ప్రోడక్ట్  Flipkart Plus క్రింద లిస్ట్ అయ్యి ఉన్నట్లయితే కనుక మీకు ఆ ఆర్డర్ పైన రూ. 40 రూపాయల డెలివరీ ఫీజు జత చేయబడుతుంది.

ఇక రూ.500 లేక అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆర్డర్స్ పైన ఎటువంటి డెలివరీ లేదా షిప్పింగ్ చార్జీలు ఉండవు. అంటే, మినిమమ్ అమౌంట్ కలిగిన ఆర్డర్స్ ను క్యాష్ ఆన్ డెలివరీ అప్షన్ తో ఎంచుకునే కస్టమర్లకు డెలివరీ ఛార్జ్ లు భారంగా మారవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :