JIO మొన్ననే తన 4GVOLTE ఫీచర్ ఫోన్ ను ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటించి అసలు ఎందుకు ఫ్రీ ఇస్తుంది అని ఎంతో మంచి బుర్రలు తొలిచి వేస్తున్న ప్రశ్న. అయితే ఇలా ఫ్రీ గా ఇవ్వటం వెనుక ఒక పెద్ద వ్యూహమే వుంది. ఇప్పుడు మీకు తెలిసినట్లుగా JIO 4GVOLTE ఫీచర్ ఫోన్ ను పొందాలంటే 1500 వందల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి అవి 3 ఏళ్ల తరువాత తిరిగి ఇవ్వబడతాయని తెలుసు మీకు . ఉదాహరణకు 10 లక్షల మంది 1500 వందల చొప్పున డిపాజిట్ చేస్తే ఎంత లేదన్న 150 కోట్లు వసూలు అవుతుంది . దానిని ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే JIO ఒకే నెలలోనే 3. 5 కోట్లు వస్తాయి . మొత్తం 3 ఏళ్లకు JIO కంపెనీ 126 కోట్ల లాభం వస్తుంది . అలా కోటి మంది డిపాజిట్ చేస్తే వడ్డీ 1260 కోట్లు . ప్రెసెంట్ JIO సర్వీసెస్ ని 12. 5 కోట్ల మంది ఉపయోగించుకుంటున్నారు. దీని బట్టి చూసుకుంటూ పొతే JIO లాభాలకు లెక్కేలేదు . ఏదయినా కానీ ఇండియా ని డిజిటల్ ఇండియా మార్చిన ఘనత JIO దే అని చెప్పుకోవాలి .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి