Airtel తన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ లో మార్పు చేసింది

Updated on 17-May-2017
HIGHLIGHTS

ముందున్న ప్లాన్స్ కంటే 100% ఎక్కువ డేటా ను అందిస్తుంది.

  Airtel  నుంచి వచ్చిన  సమాచారం  ప్రకారం ,  తన బ్రాడ్  బ్యాండ్  ప్లాన్స్  లో మార్పు చేసింది.  ముందున్న ప్లాన్స్  కంటే 100%  ఎక్కువ  డేటా  ను అందిస్తుంది. 

 ఇప్పుడు ఢిల్లీ లో Rs. 899  ధరలో 60GB  హైస్పీడ్   డేటా లభిస్తుంది.  అయితే  ఇంతకుముందర  ఇదే ప్లాన్  కింద  కేవలం   30GB  డేటా లభించేది. Rs. 1099 ప్లాన్  లో  ఇప్పడు  90GB  హైస్పీడ్ డేటా  లభిస్తుంది.    అయితే  ఇంతకుముందర  ఇదే ప్లాన్  కింద  కేవలం  50GB  డేటా లభించేది. ఇవే కాక Rs. 1299  ధర  లో ఇప్పుడు  125GB  డేటా  లభిస్తుంది.   ఇంతకుముందర  75GB డేటా  లభించేది. 

ఇవే కాక  Rs. 1499 లో ఇప్పడు  160GB డేటా లభ్యం ,  ఇంతకుముందర  కేవలం  Rs. 100GB  డేటా వచ్చేది. అలాగే  Rs. 1799  ధర  గల ప్లాన్ లో  220GB  డేటా  ఏకంగా  100Mbps  స్పీడ్ లో లభిస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :