తెలుగు రాష్ట్రాలలో ఎయిర్టెల్ 4G 40 టౌన్స్ కు అందుబాటులో ఉంది ఇప్పుడు

Updated on 06-Apr-2016

ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో 4G నెట్ వర్క్స్ ను పెంచింది. కంపెని మొట్టమొదటిగా 2015 may లో 4G సర్వీస్ ను స్టార్ట్ చేసింది హైదరాబాదు లోనే.

ఇప్పుడు 11 నెలలోవ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాలలో 4G ను 40 టౌన్స్ కు అందేలా విస్తరించినట్లు వెల్లడించింది. ఇది స్మార్ట్ ఫోన్స్, dongles, 4G hotspots, WiFi లలో కూడా అందుబాటులో ఉంది.

మీరు ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నట్లు అయితే www.airtel.in/4g/sim-swap అనే లింక్ ను ఓపెన్ చేసి 4G సిమ్ ఫ్రీ గా మరియు ఫ్రీ డెలివరీ తో కూడా మీరు ఉన్న అడ్రస్ కు తెప్పించుకోగలరు.

అలాగే ఇప్పుడు ఎయిర్టెల్ 3G ప్రైసెస్ కే 4G ఇంటర్నెట్ స్పీడ్ ను కూడా అందిస్తుంది. డిటేల్స్ కొరకు మీరు My airtel యాప్ ఇంస్టాల్ చేసుకొని చెక్ చేయగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :